Thomas Cup: థామ‌స్ క‌ప్ నెగ్గిన జ‌ట్టుకు మోదీ అభినంద‌నలు... వెల్లువెత్తుతున్న ప్ర‌శంస‌లు

  • థామ‌స్ క‌ప్ నెగ్గిన భార‌త జ‌ట్టు
  • అభినంద‌న‌లు తెలుపుతూ మోదీ ట్వీట్‌
  • అమిత్ షా, చంద్ర‌బాబు స‌హా పెద్ద సంఖ్య‌లో ప్ర‌ముఖుల అభినంద‌న‌లు
pm modi greetings to thomas cup winning indian team

థామ‌స్ క‌ప్ విజేత‌గా నిలిచిన భార‌త బ్యాడ్మింట‌న్ జ‌ట్టును ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ అభినందించారు. థామ‌స్ క‌ప్ విజ‌యంతో భార‌త బ్యాడ్మింట‌న్ జ‌ట్టు చరిత్ర సృష్టించింద‌ని చెప్పిన మోదీ... జ‌ట్టు విజ‌యంపై యావ‌త్తు భార‌త దేశం గ‌ర్విస్తోంద‌ని చెప్పారు. భార‌త జ‌ట్టు భ‌విష్య‌త్తులో మ‌రిన్ని విజ‌యాలు న‌మోదు చేయాల‌ని అభిల‌షించిన మోదీ... ఈ విజ‌యం ఔత్సాహిక క్రీడాకారుల‌ను ఉత్తేజ‌ప‌రచనుంద‌ని చెప్పారు. ఈ మేరకు మోదీ కాసేప‌టి క్రితం ఓ ట్వీట్ చేశారు.

ఇదిలా ఉంటే.... ధామ‌స్ క‌ప్ నెగ్గిన భార‌త జ‌ట్టుకు సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌శంస‌లు వెల్లువెత్తుతున్నాయి. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్‌, టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు, ఆ పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్, టీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి, ప్ర‌ముఖ పారిశ్రామిక‌వేత్త గౌత‌మ్ ఆదానీ, భార‌త క్రికెట‌ర్ విరాట్ కోహ్లీ, బీసీసీఐ, టాలీవుడ్ ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు ఎస్ఎస్ రాజ‌మౌళి, హీరో వెంకటేశ్ త‌దిత‌రుల నుంచి భార‌త బ్యాడ్మింట‌న్ జ‌ట్టుకు ప్ర‌శంస‌లు వెల్లువెత్తాయి.

More Telugu News