TDP: బొండా సిద్ధార్థ్, ఏవీ జశ్వంతి సంగీత్ వేడుక‌కు హాజరైన చంద్ర‌బాబు

  • రేపు సిద్దార్థ్‌, జ‌స్వంతిల పెళ్లి
  • హైద‌రాబాద్‌లో వేడుక‌గా జ‌రగ‌నున్న వివాహం
  • కుప్పం టూర్ నేప‌థ్యంలో సంగీత్‌కు హాజ‌రైన చంద్ర‌బాబు
chandrababu attends bonda siddharth and av jaswanthi sangeeth

టీడీపీ కీల‌క నేత‌, విజ‌య‌వాడ సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గ మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామ‌హేశ్వ‌ర‌రావు కుమారుడు సిద్ధార్థ్‌, ఆ పార్టీకి చెందిన మ‌రో కీల‌క నేత ఏవీ సుబ్బారెడ్డి కూతురు జ‌స్వంతిల వివాహ వేడుక‌లు బుధ‌వారం హైద‌రాబాద్‌లో మొద‌ల‌య్యాయి. ఈ సంద‌ర్భంగా బుధవారం సంగీత్ జ‌ర‌గ‌గా... ఈ వేడుక‌కు హాజ‌రైన టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు నూత‌న వ‌ధూవ‌రుల‌ను ఆశీర్వ‌దించారు. 

సిద్ధార్థ్‌, జ‌స్వంతిల వివాహం రేపు (మే 12) హైద‌రాబాద్‌లో వేడుక‌గా జ‌ర‌గ‌నుంది. బుధ‌వారం త‌న సొంత నియోజకవ‌ర్గం కుప్పం ప‌ర్య‌ట‌న‌కు బ‌యలుదేరిన చంద్ర‌బాబు గురు, శుక్ర‌వారాలు అక్క‌డే వుంటారు. ఈ నేప‌థ్యంలో వీరి వివాహ వేడుక‌కు చంద్ర‌బాబు హాజ‌రు కాలేక‌పోతున్నారు. ఈ నేప‌థ్యంలోనే సంగీత్ వేడుక‌కే వ‌చ్చిన చంద్ర‌బాబు నూత‌న జంట‌ను ఆశీర్వ‌దించారు.

More Telugu News