సాహాను బెదిరించిన జర్నలిస్టుపై రెండేళ్ల నిషేధం
- ఇంటర్వ్యూ ఇచ్చేందుకు నిరాకరించిన సాహా
- బెదింపులకు దిగిన జర్నలిస్టు బోరియా మజుందార్
- ఈ వ్యవహారంపై ముగ్గురు సభ్యుల కమిటీని నియమించిన బీసీసీఐ
- కమిటీ నివేదిక ఆధారంగా మజుందార్పై చర్యలు
బీసీసీఐ జారీ చేసిన ఆదేశాల ప్రకారం... దేశంలో జరిగే ఏ క్రికెట్ మ్యాచ్కు కూడా మజుందార్ హాజరు కాలేరు. ఈ మేరకు అన్నిరాష్ట్రాల క్రికెట్ అసోసియేషన్లకు ఇప్పటికే బీసీసీఐ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అదే సమయంలో విదేశాల్లో జరిగే అంతర్జాతీయ మ్యాచ్లకు కూడా మజుందార్ను అనుమతించరాదని కోరుతూ ఐసీసీకి కూడా బీసీసీఐ ఓ లేఖ రాయనుంది. అదే సమయంలో రెండేళ్ల పాటు మజుందార్కు అక్రిడిటేషన్ను కూడా జారీ చేయకుండా బీసీసీఐ చర్యలు తీసుకోనుంది.