తల్లిపాత్ర సరిగా లేనప్పుడే అఘాయిత్యాలు: ఏపీ హోంమంత్రి వనిత వివాదాస్పద వ్యాఖ్యలు
- పనుల మీద తల్లిదండ్రులు బయటకు వెళ్లినప్పుడు పిల్లలు ఒంటరిగా ఉండిపోతున్నారు
- అది ఇతరులకు అవకాశంగా మారుతోంది
- ఇలాంటి కేసుల్లో వారం రోజుల్లోనే దర్యాప్తు పూర్తి చేస్తున్నాం
- టీడీపీ హయాంలోనూ అత్యాచారాలు జరిగాయన్న మంత్రి వనిత
ఇది చాలా బాధాకరమన్నారు. మహిళా పక్షపాతి అయిన తమ ప్రభుత్వం ఇలాంటి అఘాయిత్యాలను అరికట్టేందుకు దిశ పోలీస్ స్టేషన్లను, దిశ యాప్ను అందుబాటులోకి తెచ్చిందన్నారు. ఇలాంటి కేసుల్లో ఏడు రోజుల్లోనే విచారణ పూర్తి చేసి చార్జిషీట్ దాఖలు చేస్తామని చెప్పారు. తాళ్లపూడిలో ఓ మహిళ పోలీస్ స్టేషన్కు వెళ్తే మూడు రోజుల వరకు కేసు నమోదు చేయలేదు కదా? అన్న విలేకరుల ప్రశ్నకు మంత్రి స్పందిస్తూ.. ఈ విషయంలో విచారణకు ఆదేశించామని, పోలీసుల నిర్లక్ష్యం ఉన్నట్టు తేలితే చర్యలు తీసుకుంటామని మంత్రి అన్నారు. టీడీపీ హయాంలోనూ మహిళలపై అఘాయిత్యాలు జరిగాయని, అయితే అప్పుడు వారు బయటకు వచ్చి చెప్పుకునే అవకాశం లేకపోవడం వల్లే కేసులు వెలుగులోకి రాలేదని మంత్రి అనిత వివరించారు.