Ashish Mishra: సుప్రీంకోర్టు బెయిల్ రద్దు చేయడంతో లొంగిపోయిన కేంద్రమంత్రి అజయ్ మిశ్రా తనయుడు

  • లఖింపూర్ లో అక్టోబరు 3న రైతుల ప్రదర్శన
  • నిరసన ప్రదర్శనపైకి దూసుకెళ్లిన కారు
  • 8 మంది మృతి
  • కారును నడిపినట్టు ఆశిష్ మిశ్రాపై ఆరోపణలు
Union minister Ajay Mishra son Ashish Mishra surrendered after SC cancelled bail

లఖింపూర్ హింస కేసులో ప్రధాన నిందితుడు, కేంద్రమంత్రి అజయ్ మిశ్రా తనయుడు ఆశిష్ మిశ్రా లొంగిపోయారు. లఖింపూర్ లో శాంతియుత ప్రదర్శనపైకి కారుతో వేగంగా దూసుకెళ్లి నలుగురు రైతుల సహా 8 మంది మృతికి కారకుడయ్యాంటూ ఆశిష్ మిశ్రాపై తీవ్ర అభియోగాలు మోపడం తెలిసిందే. 

అయితే, ఆశిష్ మిశ్రాకు ఈ కేసులో అలహాబాద్ హైకోర్టు  బెయిల్ మంజూరు చేయగా, సుప్రీంకోర్టు ఆ బెయిల్ ను గతవారం రద్దు చేసింది. బాధితులు తమ వాదనలను వినిపించేందుకు అలహబాద్ హైకోర్టులో అవకాశం దొరకలేదని సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో, ఆశిష్ మిశ్రా లఖింపూర్ లోని చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో నేడు లొంగిపోయారు. 

అంతకుముందు, లఖింపూర్ కేసుకు సంబంధించి దర్యాప్తు కోసం యూపీ ప్రభుత్వం సిట్ వేయగా, ఓ రిటైర్డ్ జడ్జి నేతృత్వంలోనే దర్యాప్తు జరగాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

More Telugu News