హ‌ర్యానా సీఎం ఖ‌ట్ట‌ర్‌తో ముగిసిన జ‌గ‌న్ భేటీ

ap cm meets haryana cm khattar in vizag
  • ప్ర‌కృతి వైద్యం కోసం విశాఖ‌కు ఖ‌ట్ట‌ర్‌
  • ఖ‌ట్ట‌ర్‌తో భేటీ కోస‌మే విశాఖ టూర్ ప్లాన్ చేసిన జ‌గ‌న్‌
  • హ‌ర్యానా సీఎంతో భేటీ త‌ర్వాత విజ‌య‌వాడ‌కు తిరుగుప‌య‌నం
ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌న విశాఖ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా హర్యానా ముఖ్య‌మంత్రి మ‌నోహ‌ర్ లాల్ ఖట్ట‌ర్‌తో భేటీ అయ్యారు. ఖ‌ట్ట‌ర్‌తో భేటీ కోస‌మే జ‌గ‌న్ మంగ‌ళ‌వారం ఉద‌యం విశాఖ ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. విశాఖ‌లో జ‌రిగిన ఇద్ద‌రు సీఎంల భేటీ కాసేప‌టి క్రితం ముగిసింది. ఖ‌ట్ట‌ర్‌తో భేటీ ముగించుకున్న జ‌గ‌న్ విజ‌య‌వాడ‌కు తిరుగు ప్ర‌యాణం అయ్యారు.

ప్ర‌కృతి వైద్యం చేయించుకునేందుకు విశాఖకు వ‌చ్చిన ఖ‌ట్ట‌ర్‌.. ప్ర‌స్తుతం విశాఖ ప‌రిధిలోని ఓ ప్ర‌కృతి వైద్య కేంద్రంలో చికిత్స తీసుకుంటున్నారు. ఈ సంద‌ర్భంగా త‌న రాష్ట్రానికి వ‌చ్చిన మ‌రో రాష్ట్ర ముఖ్య‌మంత్రిని మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిసేందుకే జ‌గ‌న్ విశాఖ టూర్‌కు వెళ్లినట్టు తెలుస్తోంది.
Go Back to Shorts
Haryana CM
Manohar Lal Khattar
AP CM
YS Jagan

More Telugu News