శ్రీరామనవమి సందర్భంగా చోటుచేసుకున్న హింసపై రాహుల్ గాంధీ స్పందన

Rahul Gandhi responds to violence on Srirama Navami eve
షార్ట్స్‌లో చూడండి
శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, గుజరాత్, ఝార్ఖండ్ రాష్ట్రాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. శ్రీరామ శోభాయాత్రల్లో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. గుజరాత్ లో ఓ వ్యక్తి మరణించినట్టు ప్రచారం జరుగుతోంది. ఢిల్లీలోని జేఎన్ యూలో సైతం విద్యార్థుల మధ్య ఘర్షణలు జరిగాయి. పలువురు విద్యార్థులు ఆసుపత్రి పాలయ్యారు. 

ఈ ఘటనలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. శాంతి, సామరస్యం, సౌభ్రాతృత్వంతో కూడిన పునాదులే దేశ పురోగతికి మార్గం వేస్తాయే తప్ప... విద్వేషం, హింసతో ఏమీ సాధించలేరని, పైగా ఆ రెండు అంశాలు దేశాన్ని బలహీనపరుస్తున్నాయని అభిప్రాయపడ్డారు. భిన్నరకాల సంస్కృతులకు నెలవైన సమ్మిళిత భారతదేశాన్ని కాపాడుకునేందుకు ఐక్యంగా నిలబడాలని పిలుపునిచ్చారు.
Go Back to Shorts
Rahul Gandhi
Violence
Srirama Navami
Congress
India

More Telugu News