రోడ్డు ప్రమాదానికి గురైన వారిని తన కారులో ఆసుపత్రికి తరలించిన భూమా అఖిలప్రియ
- కర్నూలు జిల్లాలో రోడ్డు ప్రమాదం
- రోడ్డు పక్కన గుంతలోకి దూసుకెళ్లిన కారు
- ముగ్గురికి గాయాలు
- మానవతా దృక్పథంతో స్పందించిన అఖిలప్రియ
ఆ సమయంలో అటుగా వెళుతున్న భూమా అఖిలప్రియ ప్రమాదం గురించి తెలుసుకుని తన వాహనం ఆపారు. గాయపడిన వారి పరిస్థితి పట్ల చలించిపోయిన ఆమె, వారిని వెంటనే తన కారులో ఎక్కించి నంద్యాలలోని ఓ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం క్షతగాత్రులకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిని సకాలంలో ఆసుపత్రికి తరలించిన భూమా అఖిలప్రియను స్థానికులు అభినందిస్తున్నారు.