YS Jagan: కోడెల స్టేడియంలో జ‌గ‌న్ స‌భ‌.. వాలంటీర్ల‌కు సీఎం స‌న్మానం

  • న‌ర‌స‌రావుపేట ప‌ర్య‌ట‌న‌కు జ‌గ‌న్‌
  • బుధ‌వారమే జ‌ర‌గాల్సిన ప‌ర్య‌ట‌న‌
  • ఢిల్లీ ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో గురువారానికి వాయిదా
ap cm jagan tour in narasaraopet tomorrow

ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి రేపు న‌ర‌స‌రావుపేట ప‌ర్య‌ట‌న‌కు వెళ్ల‌నున్నారు. ప‌ట్ట‌ణంలోని కోడెల శివ‌ప్ర‌సాద‌రావు స్టేడియంలో జ‌ర‌గ‌నున్న ఓ స‌భ‌లో జ‌గ‌న్ పాలుపంచుకోనున్నారు. గ్రామ,వార్డు వ‌లంటీర్ల‌ను స‌న్మానించేందుకు జ‌గ‌న్ ఓ ప్ర‌త్యేక కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టిన సంగ‌తి తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మాన్ని బుధ‌వార‌మే నిర్వ‌హించాల్సి ఉన్నా.. ఢిల్లీ ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో దానిని గురువారానికి వాయిదా వేశారు.

More Telugu News