Wipro: నిమిషానికి 700 సంతూర్ సబ్బుల త‌యారీ.. విప్రో యూనిట్‌ను ప్రారంభించిన కేటీఆర్‌

ktr inagurated wipro unit in maheswaram
షార్ట్స్‌లో చూడండి
తెలంగాణ‌లో విప్రో సంస్థ త‌న త‌యారీ యూనిట్‌ను మంగ‌ళ‌వారం ప్రారంభించింది. రూ.300 కోట్లతో ఏర్పాటైన ఈ యూనిట్‌ను విప్రో సంస్థ హైద‌రాబాద్ శివారులోని మ‌హేశ్వ‌రంలో ఏర్పాటు చేసింది. ఈ యూనిట్‌ను విప్రో ఫౌండ‌ర్ చైర్మ‌న్ అజిమ్ ప్రేమ్‌జీతో క‌లిసి తెలంగాణ ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ కాసేప‌టి క్రితం లాంఛ‌నంగా ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మంలో విద్యా శాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి కూడా పాలుపంచుకున్నారు.

మ‌హేశ్వ‌రంలో అత్యాధునిక టెక్నాల‌జీతో ఏర్పాటు చేసిన ఈ యూనిట్‌లో సంతూర్ స‌బ్బుల‌తో పాటు సాఫ్ట్ ట‌చ్ ఫ్యాబ్రిక్ కండిష‌న‌ర్‌ల‌ను విప్రో ఉత్ప‌త్తి చేయ‌నుంది. ఈ యూనిట్‌కు నిమిషానికి ఏకంగా 700 సంతూర్ సబ్బులను త‌యారు చేసే సామ‌ర్థ్యం ఉంద‌ని కంపెనీ ప్ర‌తినిధులు తెలిపారు. దేశంలో ఇంత వేగంగా స‌బ్బుల ఉత్ప‌త్తిని చేప‌ట్ట‌నుండ‌టం ఇదే తొలిసారని కూడా ఆ కంపెనీ ప్ర‌క‌టించింది. ఈ యూనిట్ ద్వారా 900 మందికి ఉపాధి ల‌భించ‌నుంద‌ని, అందులో 90 శాతం మంది స్థానికులేన‌ని కేటీఆర్ తెలిపారు.
Go Back to Shorts
Wipro
Azim Premji
Santoor soaps
Softouch fabric conditioners
Maheshwaram
KTR
Sabitha Indra Reddy

More Telugu News