దక్షిణ కొరియాకు సీరియస్ వార్నింగ్ ఇచ్చిన కిమ్ చెల్లెలు
- తమ వద్ద పలు క్షిపణులు ఉన్నాయన్న దక్షిణ కొరియా మంత్రి
- ఉత్తర కొరియాలో ఏ ప్రాంతాన్నైనా తాకుతాయని వెల్లడి
- మండిపడిన కిమ్ యో జోంగ్
- సాహసాలు చేయొద్దని స్పష్టీకరణ
తమ దేశం అమ్ములపొదిలో అనేక క్షిపణులు ఉన్నాయని, ఉత్తర కొరియాలో ఏ మూలకైనా అవి వెళతాయని సు వూక్ అన్నారు. పైగా, వాటి గురితప్పే ప్రశ్నే లేదని తెలిపారు. దక్షిణ కొరియా మంత్రి వ్యాఖ్యలు తమను రెచ్చగొట్టేలా ఉన్నాయని కిమ్ యో జోంగ్ మండిపడుతున్నారు.
దక్షిణ కొరియా సాహసాలు చేయాలన్న ఆలోచన కట్టిపెడితే మంచిదని స్పష్టం చేశారు. ఇలాంటి దుందుడుకు వ్యాఖ్యలు ఇరుదేశాల సంబంధాలను దెబ్బతీస్తాయని హితవు పలికారు. ఏదేమైనా ఇలాంటి ప్రకటనలు చేసేముందు ఓసారి ఆలోచించుకోవాలన్నారు.