Rajinikanth: మరోసారి జతకడుతున్న రజనీకాంత్, ఐశ్వర్యారాయ్.. దర్శకుడు ఎవరంటే..!

  • రజనీ, ఐశ్వర్యల జంటగా 2010లో వచ్చిన 'రోబో'
  • వీరిద్దరితో కొత్త చిత్రాన్ని తెరకెక్కించబోతున్న నెల్సన్ దిలీప్
  • కీలక పాత్రలో ప్రియాంక అరుల్ మోహన్
Rajinikanth and Aishwarya Rai to act in another movie

సూపర్ స్టార్ రజనీకాంత్, బాలీవుడ్ భామ ఐశ్వర్యారాయ్ జోడీగా 2010లో వచ్చిన 'రోబో' సినిమా ఓ రేంజ్ లో హిట్ అయిన సంగతి తెలిసిందే. రజనీ యాక్షన్, ఐశ్వర్య అందం, దర్శకుడు శంకర్ గ్రాఫిక్స్ మాయాజాలం అన్నీ కలిసి ఈ చిత్రానికి ఘన విజయం అందించాయి. 'రోబో' విడుదలై ఇప్పటికి 12 ఏళ్లు గడిచిపోయాయి. ఇప్పుడు వీరిద్దరూ మరోసారి జతకట్టబోతున్నారనే వార్తలు కోలీవుడ్ లో బలంగా వినిపిస్తున్నాయి. 

రజనీ, ఐశ్వర్యల తాజా చిత్రానికి నెల్సన్ దిలీప్ దర్శకత్వం వహించనున్నట్టు సమాచారం. ఈ చిత్రాన్ని కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించనున్నారు. మరోవైపు రజనీకి ఇది 169వ చిత్రం కాబోతోంది. త్వరలోనే ఈ చిత్రం పట్టాలు ఎక్కబోతున్నట్టు తెలుస్తోంది. ఇంకోవైపు ఈ సినిమాలో హీరోయిన్ ప్రియాంక అరుల్ మోహన్ ఒక కీలకపాత్రలో నటించబోతోందని సమాచారం. ఈ చిత్రానికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

More Telugu News