రెవెన్యూ డివిజన్గా మారిన కుప్పం
- చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం
- ఇటీవలే మునిసిపాలిటీగా మారిన వైనం
- 22 పట్టణాలు రెవెన్యూ డివిజన్లుగా మార్పు
ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి జరిగిన కసరత్తులో భాగంగా కొత్తగా 13 జిల్లాలను ఏర్పాటు చేయాలని తీర్మానించిన జగన్ సర్కారు.. రాష్ట్రంలోని కొన్ని పట్టణాలను రెవెన్యూ డివిజన్లుగానూ మార్చాలని భావించింది. ఇలా రాష్ట్రంలోని 22 పట్టణాలను రెవెన్యూ డివిజన్లుగా మారుస్తూ బుధవారం జగన్ నిర్ణయం తీసుకోగా.. దానికి కేబినెట్ కూడా ఆమోద ముద్ర వేసింది. ఈ 22 కొత్త రెవెన్యూ డివిజన్లలో కుప్పం కూడా ఒకటిగా ఉంది.