Lulu: త‌మిళ‌నాడులో భారీపెట్టుబ‌డి పెడుతున్న లులూ గ్రూప్

  • యూఏఈకి చెందిన రియల్ ఎస్టేట్ సంస్థ లులూ గ్రూప్    
  • త‌మిళ‌నాడులో రూ.3,500 కోట్ల పెట్టుబ‌డికి ఒప్పందం
  • దుబాయిలో సీఎం స్టాలిన్ సమక్షంలో ఒప్పందం 
lulu group will invest 3500 croresin tamilnadu

యునైటెడ్ అర‌బ్ ఎమిరేట్స్‌కు చెందిన ప్ర‌ముఖ రియ‌ల్ ఎస్టేట్ సంస్థ లులూ గ్రూప్ తమిళనాడులో భారీ పెట్టుబడులు పెడుతోంది. సుమారు రూ.3,500 కోట్లతో భారీ షాపింగ్ మాల్స్‌, హైప‌ర్ మాల్స్‌, ఫుడ్ లాజిస్టిక్ పార్కుల‌ను ఆ రాష్ట్రంలో ఏర్పాటు చేయ‌నుంది. 

ఈ మేర‌కు ప్ర‌స్తుతం దుబాయి ప‌ర్య‌ట‌న‌లో ఉన్న త‌మిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ స‌మ‌క్షంలో త‌మిళ‌నాడు ప్ర‌భుత్వంతో లులూ గ్రూప్ ఓ ఒప్పందం చేసుకుంది. ఈ ప్రాజెక్టును 2024లోగా పూర్తి చేయ‌నున్న‌ట్లుగా ఆ గ్రూప్ తెలిపింది.

More Telugu News