ఉచితాలను ఆపకపోతే.. ప్రతి రాష్ట్రం ఓ శ్రీలంకే: జేపీ వార్నింగ్
- న్యూస్ ఛానెల్ డిబేట్లో పాల్గొన్న జేపీ
- రాష్ట్రాల ఆర్థిక స్థితిగతులపై లోతైన విశ్లేషణ
- ఉత్పాదకతను మరిచి ఉచితాల బాట పడితే నష్టమని వార్నింగ్
దేశంలోని చాలా రాష్ట్రాలు ఇప్పటికే ఎఫ్ఆర్బీఎం పరిధిని దాటేసి అప్పులు చేసేశాయని చెప్పిన జేపీ.. ఉత్పాదకత లేకుండా వచ్చిన బోటాబొటి ఆదాయాన్ని ఉచిత పథకాలకు ఖర్చు చేయడం సరికాదని సూచించారు. ఈ క్రమంలో ఆయన పలు రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిని వివరించారు. అదే సమయంలో 1991లో తలెత్తిన ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ఎలాగైతే ఎఫ్ఆర్బీఎంను తీసుకొచ్చామో.. ఇప్పుడు కూడా అలాంటి ఓ కట్టుదిట్టమైన కట్టుబాటును ఏర్పాటు చేయకపోతే.. ఉచితాలకు అడ్డుకట్ట వేయలేమని జేపీ చెప్పుకొచ్చారు.