Allu Arjun: 'పుష్ప 2'లోను మెరవనున్న సమంత!

  • బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన 'పుష్ప'
  • సీక్వెల్ దిశగా మొదలైన సన్నాహాలు
  • స్పెషల్ సాంగులో దిశా పటాని 
  • త్వరలోనే సెట్స్ పైకి  
Pushpa 2 movie update

సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన 'పుష్ప' .. అది సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. బలమైన కథాకథనాలు .. పాత్రలను విభిన్నంగా తీర్చిదిద్దిన తీరు .. పాటలు ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలిచాయి. ముఖ్యంగా 'ఊ అంటావా' అనే పాటలో సమంత చేసిన సందడి అంతా ఇంతా కాదు. ఎక్కడ చూసినా ఆ పాట జోరు కొనసాగుతూనే ఉంది. 

ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్ చేసే పనిలో ఉన్నారు. ప్రస్తుతం కథా చర్చలు జరుగుతున్నాయి. జూన్ ... జూలైలలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలుకానుందని అంటున్నారు. ఈ సినిమాలో ఆ ఐటమ్ భామగా ఈ సారి దిశా పటాని కనిపించనుందనే టాక్ వచ్చింది. యూత్ లో విపరీతమైన క్రేజ్ ఉన్న ఈ భామనే రంగంలోకి దింపుతున్నారట.

అయితే ఈ సినిమాలోనూ సమంత మెరవనుందనే ఒక టాక్ బలంగానే వినిపిస్తోంది. ఒక ప్రత్యేకమైన పాత్రలో ఆమె కనిపిస్తుందని అంటున్నారు. తన అభిమాన తార సమంత అని చాలా వేదికలపై సుకుమార్ చెప్పిన సంగతి తెలిసిందే. ఆమె పట్ల గల ఆ అభిమానంతోనే ఆమె కోసం ఒక ప్రత్యేకమైన పాత్రను డిజైన్ చేయడం జరిగిందని చెబుతున్నారు.  

More Telugu News