Vijayasai Reddy: ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి

Vijayasai Reddy met PM Narendra Modi in Delhi
షార్ట్స్‌లో చూడండి
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి నేడు ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. మోదీకి శాలువా కప్పి సన్మానించి విజయసాయి, ఆయనకు వినాయకుడి ప్రతిమను అందజేశారు. ఈ మేరకు ట్విట్టర్ లో వెల్లడించారు. ప్రధానిని కలిసి ఏపీకి సంబంధించిన అనేక అంశాలపై చర్చించినట్టు విజయసాయి తెలిపారు. 

అంతకుముందు, విజయసాయిరెడ్డిని ఆయన కార్యాలయంలో ఈ ఉదయం కొందరు తెలుగు విద్యార్థులు కలిశారు. వారు ఢిల్లీ యూనివర్సిటీలో విద్యాభ్యాసం చేస్తున్నారు. మన తెలుగు విద్యార్థులను కలవడం ఆనందంగా ఉందని విజయసాయి ఓ ట్వీట్ లో పేర్కొన్నారు. ఢిల్లీ వర్సిటీలో చదువుకుంటున్న ఆ తెలుగు విద్యార్థులు అదే సమయంలో సివిల్స్ కు సన్నద్ధమవుతున్నారని వెల్లడించారు.
.
Go Back to Shorts
Vijayasai Reddy
Narendra Modi
New Delhi
YSRCP
Andhra Pradesh

More Telugu News