TDP: టీడీపీ ఎమ్మెల్యేల అరెస్ట్‌.. టీడీపీ శ్రేణులకు, పోలీసులకు మధ్య తోపులాట

  • ప్ర‌సాదంపాడులో ఘ‌ట‌న‌
  • ఎక్రైజ్ క‌మిష‌న‌ర్ కార్యాల‌యానికి టీడీపీ ఎమ్మెల్యేలు
  • నాటుసారా మ‌ర‌ణాల‌పై విన‌తి ప‌త్రం అంద‌జేసేందుకు య‌త్నం
  • అడ్డుకుని అరెస్ట్ చేసిన పోలీసులు
bezawada police arrestsv tdp mlas

  విజ‌య‌వాడ న‌గ‌రంలో బుధ‌వారం మ‌ధ్యాహ్నం ఉద్రిక్త వాతావ‌ర‌ణం చోటుచేసుకుంది. ఆబ్కారీ శాఖ క‌మిష‌న‌ర్‌కు విన‌తి ప‌త్రం ఇచ్చేందుకు వ‌చ్చిన టీడీపీ ఎమ్మెల్యేల‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంద‌ర్భంగా టీడీపీ శ్రేణులు, పోలీసుల మ‌ధ్య తోపులాట చోటుచేసుకుంది. దీంతో కొద్దిసేపు అక్క‌డ ఉద్రిక్త వాతావ‌ర‌ణం కనిపించింది.  

ఈ ఘ‌ట‌న వివ‌రాల్లోకి వెళితే.. ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా జంగారెడ్డిగూడెంలో ఇటీవ‌లే చోటుచేసుకున్న నాటుసారా మ‌ర‌ణాల‌పై ఎక్సైజ్ క‌మిష‌న‌ర్‌కు విన‌తి ప‌త్రం ఇచ్చేందుకు టీడీపీ ఎమ్మెల్యేలు నిర్ణ‌యించారు. న‌గ‌రంలోని ప్ర‌సాదంపాడులో ఉన్న ఎక్సైజ్ శాఖ క‌మిష‌న‌ర్ కార్యాల‌యానికి వారంతా బ‌య‌లుదేరారు. 

ఈ విష‌యం తెలుసుకున్న పోలీసులు ముందుగానే అక్క‌డ‌కు చేరుకుని టీడీపీ ఎమ్మెల్యేల‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ సంద‌ర్భంగా పోలీసుల వైఖ‌రిపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన టీడీపీ ఎమ్మెల్యేలు క‌నీసం విన‌తి ప‌త్రం స‌మ‌ర్ప‌ణ‌కు కూడా త‌మ‌ను అనుమ‌తించ‌రా? అంటూ మండిప‌డ్డారు.

More Telugu News