Salman Khan: సల్మాన్ ఖాన్ జింకల వేట కేసు రాజస్థాన్ హైకోర్టుకు బదిలీ

Salman Khan Blackbuck poaching case transferred
  • సల్మాన్ ను ఇప్పటికీ వెంటాడుతున్న కృష్ణజింకల వధ కేసు
  • 1998లో ఘటన
  • 2018లో సల్మాన్ ను దోషిగా నిర్ధారించిన జోథ్ పూర్ కోర్టు
  • బెయిల్ పొందిన సల్మాన్ ఖాన్
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ను 1998 నాటి కృష్ణజింకల కేసు ఇంకా వెంటాడుతూనే ఉంది. తాజాగా ఈ కేసులో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. సల్మాన్ ఖాన్ జింకలవేట కేసును విచారించేందుకు రాజస్థాన్ హైకోర్టు అంగీకరించింది. ఈ మేరకు సల్మాన్ ఖాన్ దాఖలు చేసిన కేసు బదిలీ పిటిషన్ కు కోర్టు ఆమోదముద్ర వేసింది. ఈ నేపథ్యంలో, ఈ కేసుకు సంబంధించి అన్ని పిటిషన్లపై ఇక రాజస్థాన్ హైకోర్టులోనే విచారణ జరుపుతారు. 

'హమ్ సాథ్ సాథ్ హై' చిత్రం షూటింగ్ రాజస్థాన్ లో జరిగిన సమయంలో సల్మాన్ తన సహనటులతో కలిసి కృష్ణజింకలను వేటాడినట్టు అభియోగాలు మోపారు. సల్మాన్ పై 9/51 ఇండియన్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 తో పాటు ఆయుధాల చట్టంలోని 3/25, 3/27 సెక్షన్లతో కేసు నమోదైంది. 

ఈ కేసులో సల్మాన్ ను దోషిగా నిర్ధారిస్తూ 2018లో జోథ్ పూర్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. అయితే సల్మాన్ ఆ తర్వాత బెయిల్ పొందాడు. తొలుత ఈ కేసులో సల్మాన్ తో పాటు సైఫ్ ఆలీ ఖాన్, సోనాలీ బెంద్రే, నీలమ్, టబులపైనా చార్జిషీటు దాఖలైంది. పలు దఫాల విచారణ అనంతరం వారు నిర్దోషులుగా బయటపడ్డారు.
Salman Khan
Blackbuck Poaching
'Rajasthan High Court
Bollywood

More Telugu News