గోవా సీఎంగా ప్రమోద్ సావంత్.. ప్రకటించిన బీజేపీ
- గోవాకు రెండోసారి సీఎంగా ప్రమోద్
- గోవా బీజేపీ శాసనసభాపక్ష నేతగా ఎంపిక
- గెలిచిన నాలుగు రాష్ట్రాల్లో పాతకాపులకే బాధ్యతలు
ఇటీవల ముగిసిన ఐదు రాష్ట్రాల్లో బీజేపీ విజయం సాధించిన నాలుగు రాష్ట్రాల సీఎం అభ్యర్థులను ఆ పార్టీ ప్రకటించినట్టయింది. నాలుగు రాష్ట్రాల్లో కూడా అంతకుముందు సీఎంలుగా వ్యవహరించిన నేతలకే మళ్లీ ఆ పదవులను అప్పగించింది. ఇప్పటికే యూపీ సీఎంగా యోగి ఆదిత్యనాథ్ ను ప్రకటించిన బీజేపీ.. తాజాగా మణిపూర్ సీఎంగా బీరేన్ సింగ్, ఉత్తరాఖండ్ సీఎంగా పుష్కర్ సింగ్ ధామి, గోవా సీఎంగా ప్రమోద్ సావంత్లను ఆయా రాష్ట్రాలకు సీఎంలుగా ప్రకటించింది.