BSNL: 4జీ సేవలతో పోరుకు బీఎస్ఎన్ఎల్ రెడీ.. రూ.17,000 కోట్ల ఆదాయంపై కన్ను!
- నాణ్యమైన 4జీ సేవలను ఆఫర్ చేస్తాం
- కస్టమర్లు మా నుంచి వెళ్లిపోరనే మా నమ్మకం
- 5జీ విస్తరణకు సమయం పడుతుంది
- బీఎస్ఎన్ఎల్ చైర్మన్, ఎండీ పుర్వార్
పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయి.. ఒడ్డును పడే ప్రయత్నాలు చేస్తున్న ప్రభుత్వరంగ టెలికం కంపెనీ బీఎస్ఎన్ఎల్.. 4జీ టెక్నాలజీతో దిగ్గజాలకు పోటీ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. సంస్థ చైర్మన్, ఎండీ పీకే పుర్వార్ దీనిపై మాట్లాడుతూ.. 2021-22 సంవత్సరంలో రూ.17,000 కోట్ల ఆదాయం లభిస్తుందన్న అంచనాతో ఉన్నట్టు చెప్పారు. వాస్తవానికి అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఆదాయం రూ.17,452 పోలిస్తే తక్కువే. కాల్ కనెక్ట్ చార్జీలను తొలగించడం ఇందుకు కారణంగా పుర్వార్ తెలిపారు.