Sanjay Raut: ఎన్నిక‌లు వ‌చ్చే నాటికి ఈ సినిమాను ప్ర‌జ‌లు మ‌ర్చిపోతారు: సంజ‌య్ రౌత్

  • దేశ వ్యాప్తంగా ది కశ్మీర్ ఫైల్స్ సినిమాకు ఆద‌ర‌ణ‌
  • క‌శ్మీర్ లాంటి సున్నితమైన అంశంపై రాజకీయాలు చేయడం సరికాదన్న రౌత్
  • వచ్చే ఎన్నికల్లో ఏ ఒక్కరికీ రాజకీయ ప్రయోజనం చేకూర‌దని వ్యాఖ్య‌
Sanjay Raut on kashmir files movie

మొద‌ట కేవ‌లం 400 థియేట‌ర్ల‌లోనే విడుద‌లైన ది కశ్మీర్ ఫైల్స్ సినిమా ఇప్పుడు ఏకంగా 4,000 థియేట‌ర్ల‌లో ఆడుతూ రికార్డుల‌ను తిర‌గ‌రాసే దిశ‌గా వెళ్తున్న విష‌యం తెలిసిందే. కేవ‌లం నోటి మాట ద్వారా ఈ సినిమాకు ఎన‌లేని ప‌బ్లిసిటీ వ‌స్తోంది. ఈ సినిమాపై వివాదాలు కూడా రాజుకుంటుండ‌డంతో దీనిపై శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్ స్పందించారు. క‌శ్మీర్ లాంటి సున్నితమైన అంశంపై రాజకీయాలు చేయడం సరికాదని హిత‌వు ప‌లికారు. 

‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’ కేవలం సినిమా మాత్రమేనని అన్నారు. దీని వల్ల వచ్చే ఎన్నికల్లో ఏ ఒక్కరికీ రాజకీయ ప్రయోజనం చేకూరుతుందని తాను అనుకోవట్లేద‌ని తెలిపారు. ఎన్నికల నాటికి ఈ సినిమాను ప్రజలు మర్చిపోతారని చెప్పారు. కాగా, ఈ సినిమాపై కొంద‌రు నేత‌లు ప్ర‌శంస‌లు కురిపిస్తుండ‌గా, ఇందులో అస‌త్యాలు చూపించారంటూ మ‌రికొంద‌రు విమ‌ర్శ‌లు చేస్తున్నారు.

More Telugu News