Ukraine: ఉక్రెయిన్ లో చిక్కుకున్న కుమారుడు.. టెన్షన్ తట్టుకోలేక తల్లి మృతి!

Mother died with tension about her son studying in Ukraine
  • ఉక్రెయిన్ లో చదువుకుంటున్న శక్తివేల్
  • యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి కొడుకు గురించి తీవ్ర ఒత్తిడికి గురైన ఆయన తల్లి
  • వీడియో కాల్ ద్వారా తల్లి మృతదేహాన్ని చూసి భోరున విలపించిన శక్తివేల్
యుద్ధం కారణంగా ఉక్రెయిన్ లో భయానక వాతావరణం నెలకొంది. భారతీయులు పెద్ద సంఖ్యలో అక్కడ చిక్కుకున్నారు. మరోవైపు తన కొడుకు సురక్షితంగా తిరిగొస్తాడో, లేదో అనే ఒత్తిడిని తట్టుకోలేక ఓ కన్నతల్లి ప్రాణం విడిచింది. 

వివరాల్లోకి వెళ్తే తమిళనాడు తిరుపత్తూరుకు చెందిన శక్తివేల్ ఉక్రెయిన్ లో చదువుకుంటున్నాడు. ఉక్రెయిన్ పై రష్యా దాడి చేసినప్పటి నుంచి ఆమె తీవ్ర ఆందోళన చెందుతోంది. కొడుకు రాకకోసం వేయికళ్లతో ఎదురు చూసింది. 

ఈ క్రమంలో ఆమె తీవ్ర అనారోగ్యానికి గురయింది. దీంతో కుటుంబసభ్యులు ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె తుదిశ్వాస విడిచింది. వీడియో కాల్ ద్వారా తన తల్లి మృతదేహాన్ని చూసిన కుమారుడు భోరున విలపించాడు.
Ukraine
Son
Mother
Dead

More Telugu News