Nagarjuna: ఇక అఖిల్ తో కలిసి తెరపైకి నాగార్జున!

  • నాగ్ - చైతూ కాంబినేషన్లో వచ్చిన 'బంగార్రాజు'
  • రికార్డుస్థాయి వసూళ్లు రాబట్టిన సినిమా 
  • అఖిల్ తో ప్లాన్ చేసిన నాగ్ 
  • దర్శకుడిగా మోహన్ రాజా
Nagarjuna in Mohan Raja Movie

నాగార్జున - నాగచైతన్య కలిసి నటించిన 'బంగార్రాజు' సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో ఈ సినిమా ఒక రేంజ్ లో సందడి చేసింది. రికార్డు స్థాయి వసూళ్లను రాబట్టింది. ఈ సినిమాకి ముందు వరుస పరాజయాలతో ఉన్న నాగార్జునకు ఊరటను ఇచ్చింది.

ఈ సినిమాతో నాగార్జున హీరోగా .. నిర్మాతగా తాను భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా, చైతూ ఎకౌంట్ లోకి కూడా ఆ సక్సెస్ చేరేలా చేయగలిగారు. తండ్రీ కొడుకులుగా గట్టి హిట్ కొట్టామనే ఒక సంతృప్తిని దక్కించుకున్నారు. ఇక ఇప్పుడు నాగార్జున .. అఖిల్ తో కలిసి ఒక సినిమా చేయనున్నారనే టాక్ బలంగానే వినిపిస్తోంది. 

శాస్త్రానికి అన్నట్టుగా ఈ ఇద్దరూ కలిసి 'మనం' సినిమాలో కనిపించారు. ఇక ఇప్పుడు సినిమా మొత్తం కూడా తెరపై కలిసి కనిపించనున్నారని అంటున్నారు. ఈ సినిమా కూడా నాగ్ సొంత బ్యానర్లోనే రూపొందనుందని చెబుతున్నారు. చిరంజీవితో 'గాడ్ ఫాదర్' రూపొందిస్తున్న మోహన్ రాజా ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నాడని అంటున్నారు. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడుతుందని చెప్పుకుంటున్నారు.

More Telugu News