ఏపీలో ఎన్ఐఏ సోదాల క‌ల‌క‌లం

nia seaches in ap and kerala
  • మావోయిస్టు సానుభూతిప‌రుల ఇళ్ల‌ల్లో సోదాలు
  • ప్ర‌జా సంఘాల నేత‌ల ఇళ్ల‌ల్లోనూ దాడులు
  • గుంటూరు, చిత్తూరు జిల్లాల్లోని ప‌లు ప్రాంతాల్లో సోదాలు
  • కేర‌ళ స‌హా ఏపీలోని 8 చోట్ల సోదాలు
ఏపీలోని ప‌లు ప్రాంతాల్లో శుక్ర‌వారం నాడు నేష‌న‌ల్ ఇన్వెస్టిగేష‌న్ ఏజెన్సీ (ఎన్ఐఏ) అధికారులు సోదాలు నిర్వ‌హించారు. ప్ర‌జా సంఘాల‌కు చెందిన నేత‌ల‌తో పాటు గ‌తంలో మావోయిస్టుల‌కు సానుభూతిప‌రులుగా ప‌నిచేసిన వారి ఇళ్లే టార్గెట్‌గా ఈ సోదాలు జ‌రిగాయి. ఇందులో భాగంగా గుంటూరు, చిత్తూరు జిల్లాల్లోని ప‌లు ప్రాంతాల్లో ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వ‌హించారు.

చాప‌కింద నీరులా మరోమారు మావోయిస్టులు బ‌లం పుంజుకుంటున్నార‌ని, ఈ క్ర‌మంలోనే త‌మ సంస్థ‌లోకి భారీగా రిక్రూట్‌మెంట్లు జ‌రుపుతున్నార‌న్న స‌మాచారంతోనే ఎన్ఐఏ రంగంలోకి దిగిన‌ట్లుగా స‌మాచారం. ఏపీతో పాటు కేర‌ళ‌లో కూడా ఇదే కార‌ణంతో ఎన్ఐఏ సోదాలు నిర్వ‌హించింది.
Go Back to Shorts
nia
maoist
Guntur District
Chittoor District
Kerala]

More Telugu News