Pawan Kalyan: 'భీమ్లా నాయక్' కు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్

  • ఐదో షో వేసుకోవడానికి అనుమతి ఇచ్చిన టీఎస్ సర్కార్
  • ఈ నెల 25న విడుదల కాబోతున్న 'భీమ్లా నాయక్'
  • కాసేపట్లో ప్రారంభం కానున్న ప్రీరిలీజ్ ఈవెంట్
TS govt gives permission to Bheemla Nayak 5th show

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తాజా చిత్రం 'భీమ్లా నాయక్' ఈ నెల 25న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఈ చిత్రానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 25 నుంచి మార్చి 11వ తేదీ వరకు థియేటర్లలో ఐదో ఆటను ప్రదర్శించుకోవడానికి అనుమతిని ఇచ్చింది.

ఈ వార్తతో సినిమా యూనిట్ తో పాటు, పవన్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కాసేపట్లో హైదరాబాద్ యూసుఫ్ గూడలోని పోలీస్ గ్రౌండ్స్ లో ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ జరగబోతోంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి కేటీఆర్, ప్రత్యేక అతిథిగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరుకానున్నారు.

More Telugu News