Lalu Prasad Yadav: అస్వస్థతతో ఆసుపత్రిపాలైన లాలూ ప్రసాద్ యాదవ్

  • దాణా కేసులో లాలూకు జైలు శిక్ష
  • ఐదేళ్ల జైలు శిక్ష ఖరారు చేసిన న్యాయస్థానం
  • రూ.60 లక్షల జరిమానా
  • రాంచీ ఆసుపత్రిలో లాలూకు చికిత్స
RJD Chief Lalu Prasad Yadav hospitalized

రాష్ట్రీయ జనతాదళ్ పార్టీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కు దాణా కుంభకోణంలో ఐదో కేసులో ఐదేళ్ల జైలు శిక్ష, రూ.60 లక్షల జరిమానా ఖరారు కావడం తెలిసిందే. అయితే, లాలూ ప్రసాద్ యాదవ్ తీవ్ర అస్వస్థతకు గురికాగా, ఆయనను జార్ఖండ్ రాజధాని రాంచీలోని రాజేంద్ర ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆసుపత్రికి తరలించారు.

లాలూ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు స్పందించారు. తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చేరారని, ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వెల్లడించారు.

More Telugu News