Telangana: తెలంగాణలో మరింత తగ్గిన కరోనా వ్యాప్తి... కొత్తగా 385 పాజిటివ్ కేసులు

  • గత 24 గంటల్లో 39,386 కరోనా పరీక్షలు
  • జీహెచ్ఎంసీ పరిధిలో 95 కొత్త కేసులు
  • కరోనా నుంచి కోలుకున్న 733 మంది
  • ఇంకా 4,787 మందికి చికిత్స
Telangana corona daily bulletin

తెలంగాణలో కరోనా వ్యాప్తి బాగా తగ్గింది. గడచిన 24 గంటల్లో 39,386 శాంపిల్స్ పరీక్షించగా, 385 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. జీహెచ్ఎంసీ పరిధిలో 95 కొత్త కేసులు నమోదు కాగా, రంగారెడ్డి జిల్లాలో 31, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 27, ఖమ్మం జిల్లాలో 21 కేసులు వెల్లడయ్యాయి.

అదే సమయంలో 733 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 7,87,063 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 7,78,167 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 4,787 మంది చికిత్స పొందుతున్నారు.

More Telugu News