నగరి నియోజకవర్గం మొత్తాన్ని బాలాజీ జిల్లాలో ఉంచాలి: వైసీపీ ఎమ్మెల్యే రోజా
- కొంత భాగం బాలాజీ జిల్లా, మరికొంత భాగం చిత్తూరు జిల్లాలో నగరి నియోజకవర్గం
- దీనివల్ల ప్రజలకు ఇబ్బంది కలుగుతుందన్న రోజా
- జగన్ కు వినతిపత్రాన్ని అందిస్తానని వ్యాఖ్య
తన నియోజకవర్గం నగరి ప్రధానంగా కొత్తగా ఏర్పడబోయే బాలాజీ జిల్లాలో ఉందని... మరికొంత చిత్తూరు జిల్లాలో ఉంటుందని ఆమె తెలిపారు. రెండు జిల్లాల్లో నియోజకవర్గం ఉండటం వల్ల ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని చెప్పారు. ఈ విషయాన్ని నియోజకవర్గ ప్రజలు కూడా తన దృష్టికి తీసుకొచ్చారని అన్నారు. మొత్తం నియోజకవర్గాన్ని బాలాజీ జిల్లాలోనే కలపాలని ఆమె కోరారు. ఇందుకోసం ఓ వినతిపత్రాన్ని సీఎం జగన్ కు అందజేస్తామని చెప్పారు.