Team India: రెండో వన్డేలో టీమిండియా ఘనవిజయం... సిరీస్ కైవసం

  • అహ్మదాబాద్ లో మ్యాచ్
  • 44 పరుగుల తేడాతో ఓడిన వెస్టిండీస్
  • లక్ష్యఛేదనలో 193 పరుగులకే ఆలౌట్
  • 4 వికెట్లు తీసిన ప్రసిద్ధ్ కృష్ణ
Team India wins second odi and clinched series

వెస్టిండీస్ తో అహ్మదాబాద్ లో జరిగిన రెండో వన్డేలో టీమిండియా 44 పరుగులతో ఘనవిజయం అందుకుంది. 238 పరుగుల విజయలక్ష్యంతో బరిలో దిగిన వెస్టిండీస్ ను 193 పరుగులకే ఆలౌట్ చేసింది. ఈ విజయంలో ఫాస్ట్ బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ ప్రధాన భూమిక పోషించాడు. ప్రసిద్ధ్ 12 పరుగులు ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. శార్దూల్ ఠాకూర్ 2, సిరాజ్ 1, చహల్ 1, సుందర్ 1, హుడా 1 వికెట్ తీశారు. వెస్టిండీస్ జట్టులో షామ్రా బ్రూక్స్ అత్యధికంగా 44 పరుగులు సాధించాడు.

లోయరార్డర్ లో అకీల్ హోసీన్ (34), ఓడియన్ స్మిత్ (24) రాణించినా అది కాసేపే అయింది. భారత బౌలర్ల ధాటికి ఆ జట్టు 46 ఓవర్లలోనే ఆలౌట్ అయింది. ఈ విజయంతో టీమిండియా 3 వన్డేల సిరీస్ ను 2-0తో కైవసం చేసుకుంది. ఇక ఈ నెల 11న ఇరు జట్ల మధ్య మూడో వన్డే జరగనుంది.

More Telugu News