Team India: రెండో వన్డేలో టాస్ గెలిచిన వెస్టిండీస్... తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా

  • అహ్మదాబాద్ లో మ్యాచ్
  • మొదట బౌలింగ్ ఎంచుకున్న వెస్టిండీస్
  • ఆదిలోనే రోహిత్ శర్మ అవుట్
  • ఓపెనర్ గా రిషబ్ పంత్
Team India loses early wicket against West Indies

అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో టీమిండియా, వెస్టిండీస్ జట్ల మధ్య రెండో వన్డే ప్రారంభమైంది. ఈ పోటీలో టాస్ గెలిచిన వెస్టిండీస్ బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ కు దిగిన టీమిండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. కెప్టెన్, ఓపెనర్ రోహిత్ శర్మ 5 పరుగులకే అవుటయ్యాడు. కీమార్ రోచ్ బౌలింగ్ లో షాయ్ హోప్ కి క్యాచ్ ఇచ్చాడు. దాంతో భారత్ 9 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది.

ప్రస్తుతం జట్టు స్కోరు 5 ఓవర్లకు 1 వికెట్ నష్టానికి 16 పరుగులు. క్రీజులో రిషబ్ పంత్ (4 బ్యాటింగ్), విరాట్ కోహ్లీ (5 బ్యాటింగ్) ఉన్నారు. ఈ మ్యాచ్ లో కేఎల్ రాహుల్ పునరాగమనం చేయగా, రిషబ్ పంత్ ఓపెనర్ గా బరిలో దిగాడు.

More Telugu News