Mahesh Babu: మహేశ్ మూవీలో బెంగళూర్ బ్యూటీ!

  • ముగింపు దశలో 'సర్కారువారి పాట'
  • మే నెలలో ప్రేక్షకుల ముందుకు
  • మార్చి నుంచి త్రివిక్రమ్ సినిమా మొదలు
  • రెండో కథానాయికగా శ్రీలీల?  
Sreeleela in Mahesh Babu movie

ప్రస్తుతం మహేశ్ బాబు 'సర్కారువారి పాట' సినిమాను పూర్తిచేసే పనిలో ఉన్నాడు. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కథానాయికగా కీర్తి సురేశ్ నటిస్తోంది. ఈ సినిమాను ఏప్రిల్ 1వ తేదీన విడుదల చేయాలనుకున్నారు. కానీ షూటింగు పరమైన జాప్యం వలన, మే నెలలో థియేటర్లకు తీసుకురానున్నారు.

ఇక ఈ సినిమా తరువాత త్రివిక్రమ్ తో కలిసి మహేశ్ సెట్స్ పైకి వెళ్లనున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన పనులు జరుగుతున్నాయి. మార్చి 2వ వారం నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలుకానుంది. కథానాయికగా పూజ హెగ్డేను తీసుకున్నారు. అయితే మరో కథానాయికగా శ్రీలీలను తీసుకున్నారనేది తాజా సమాచారం.

'పెళ్లి సందD' సినిమాతో తెలుగు తెరకి శ్రీలీల పరిచయమైంది. గ్లామర్ పరంగా యూత్ నుంచి మంచి మార్కులు కొట్టేసిన ఈ బెంగళూర్ బ్యూటీ, ప్రస్తుతం రవితేజ సరసన 'ధమాకా' చేస్తోంది. తాజాగా మహేశ్ బాబు సినిమాలోను ఛాన్స్ కొట్టేసింది. మొత్తానికి కృతి శెట్టి మాదిరిగానే ఈ సుందరి వరుస ప్రాజెక్టులను లైన్లో పెట్టేస్తోంది.

More Telugu News