Telangana: తెలంగాణలో మరో 2,098 మందికి కరోనా... పూర్తి వివరాలు ఇవిగో!

  • గత 24 గంటల్లో 74,803 కరోనా పరీక్షలు
  • జీహెచ్ఎంసీ పరిధిలో 629 కొత్త కేసులు
  • రాష్ట్రంలో ఇద్దరి మృతి
  • ఇంకా 29,226 మందికి చికిత్స
Telangana corona report

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 74,803 కరోనా పరీక్షలు నిర్వహించగా... 2,098 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. జీహెచ్ఎంసీ పరిధిలో 629 కొత్త కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 117, ఖమ్మం జిల్లాలో 101 కేసులు వెల్లడయ్యాయి.

అదే సమయంలో 3,801 మంది ఆరోగ్యవంతులు కాగా, ఇద్దరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 7,76,313 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 7,42,988 మంది కోలుకున్నారు. ఇంకా 29,226 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో మరణించిన వారి సంఖ్య 4,099కి పెరిగింది.

More Telugu News