Nagachaitanya: విక్రమ్ కుమార్ స్పీడ్ మీదే ఉన్నాడే!

  • విక్రమ్ కుమార్ తాజా చిత్రంగా 'థ్యాంక్యూ'
  • చైతూ జోడీగా రాశి ఖన్నా
  • విదేశీ నేపథ్యంలోను నడిచే కథ
  • సంగీత దర్శకుడిగా తమన్  
Thank you movie update

విక్రమ్ కుమార్ ఒక కథను రెడీ చేసుకోవడానికీ .. దానిని ప్రేక్షకుల ముందుకు తీసుకుని రాడానికి మధ్య చాలా సమయం ఉంటుంది. స్క్రిప్ట్ పరంగా .. షూటింగ్ పరంగా ఏ విషయంలోను రాజీపడకపోవడం వల్లనే ఆయన ప్రాజెక్టులు ఆలస్యమవుతూ ఉంటాయని చెప్పుకుంటూ ఉంటారు.

ఇక ఆయన తాజా చిత్రంగా 'థ్యాంక్యూ' రూపొందింది. నాగచైతన్య - రాశీ ఖన్నా జంటగా విక్రమ్ కుమార్ ఈ కథను సెట్స్ పైకి తీసుకుని వెళ్లాడు. ఈ కథ ఇటు ఇండియాలోనూ .. అటు ఫారిన్ లోను జరుగుతుంది. కరోనా ఎఫెక్ట్ వలన ఈ సినిమా షూటింగుకి కూడా అంతరాయం ఏర్పడింది. దాంతో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి అనుకున్న దానికంటే చాలా ఆలస్యమవుతుందనే టాక్ వినిపించింది.

కానీ విక్రమ్ కుమార్ మాంఛి స్పీడ్ మీదే ఈ సినిమాను పూర్తిచేశాడు. ఈ సినిమా షూటింగు పూర్తయిందనే విషయాన్ని అధికారికంగా తెలియజేశారు. అందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. తమన్ సంగీతం .. పీసీ శ్రీరామ్ కెమెరా పనితనం ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలుస్తాయని అంటున్నారు.

More Telugu News