Telangana: తెలంగాణలో మరో 2,421 మందికి కరోనా... వివరాలు ఇవిగో!

  • గత 24 గంటల్లో 81,417 కరోనా టెస్టులు
  • జీహెచ్ఎంసీ పరిధిలో 649 మందికి పాజిటివ్
  • రాష్ట్రంలో ఇద్దరి మృతి
  • ఇంకా 33,104 మందికి చికిత్స
Telangana corona cases latest bulletin

తెలంగాణలో కరోనా రోజువారీ కేసుల్లో తగ్గుదల కనిపిస్తోంది. గడచిన 24 గంటల్లో 81,417 శాంపిల్స్ పరీక్షించగా... 2,421 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 649 కొత్త కేసులు నమోదయ్యాయి. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 144, రంగారెడ్డి జిల్లాలో 114, హనుమకొండ జిల్లాలో 106, నల్గొండ జిల్లాలో 100 కేసులు వెల్లడయ్యాయి.

అదే సమయంలో 3,980 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 7,71,828 మంది కరోనా బారినపడగా, వారిలో 7,34,628 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 33,104 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో మరణించిన వారి సంఖ్య 4,096కి పెరిగింది.

  • Loading...

More Telugu News