Telangana: తెలంగాణలో మరో 2,861 మందికి కరోనా పాజిటివ్

Telangana corona update
  • గత 24 గంటల్లో 81,486 కరోనా పరీక్షలు
  • జీహెచ్ఎంసీ పరిధిలో 746 కొత్త కేసులు
  • రాష్ట్రంలో ముగ్గురి మృతి
  • ఇంకా 37,168 మందికి చికిత్స

తెలంగాణలో కరోనా వ్యాప్తి కొంచెం నిదానించింది. గడచిన 24 గంటల్లో 81,486 శాంపిల్స్ పరీక్షించగా... 2,861 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. జీహెచ్ఎంసీ పరిధిలో 746 కొత్త కేసులు నమోదు కాగా, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 234, రంగారెడ్డి జిల్లాలో 165, ఖమ్మం జిల్లాలో 130, నల్గొండ జిల్లాలో 104 కేసులు వెల్లడయ్యాయి.

అదే సమయంలో 4,413 మంది కరోనా నుంచి కోలుకోగా, ముగ్గురు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 7,63,911 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 7,22,654 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 37,168 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో మరణించిన వారి సంఖ్య 4,089కి పెరిగింది.

  • Loading...

More Telugu News