Vijay Sai Reddy: విజయవాడ జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టగానే బాబు కంటే మొదట మూర్ఛపోయింది యనమలే: విజయసాయిరెడ్డి

Vijayasai Reddy comments on Yanamala
  • విజయవాడ జిల్లాకు ఎన్టీఆర్ పేరు
  • సర్వత్రా హర్షం
  • యనమలపై ధ్వజమెత్తిన విజయసాయి
  • ఎన్టీఆర్ శాపం అంటూ ట్వీట్
ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు సందర్భంగా, రాష్ట్ర ప్రభుత్వం విజయవాడ కేంద్రంగా ఎన్టీఆర్ జిల్లా ప్రతిపాదన చేయడం తెలిసిందే. దీనిపై ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు, అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

సీఎం జగన్ విజయవాడ జిల్లాకు ఎన్టీఆర్ పేరుపెట్టగానే బాబు కంటే మొదట మూర్ఛపోయింది యనమలేనని వ్యంగ్యం ప్రదర్శించారు. 'రాజకీయ భిక్ష పెట్టిన పార్టీ వ్యవస్థాపకుడి పేరు వినడానికే ఇష్టపడడట ఈ నమ్మకద్రోహి' అంటూ యనమలపై ధ్వజమెత్తారు. 'ఎన్టీఆర్ శాపం వల్లే ప్రత్యక్ష ఎన్నికల్లో యనమల వరుసగా ఓడిపోతున్నాడని రాష్ట్రమంతా ప్రచారంలో ఉందని' ఎద్దేవా చేశారు. 
Vijay Sai Reddy
Yanamala
NTR District
NTR
TDP
CM Jagan
YSRCP
Andhra Pradesh

More Telugu News