తెలంగాణ మంత్రి నిరంజన్ రెడ్డికి కరోనా
- తెలంగాణలో కొనసాగుతున్న కరోనా వ్యాప్తి
- నిత్యం 3 వేలకు పైచిలుకు కొత్త కేసులు
- నేడు మంత్రి నిరంజన్ రెడ్డికి కరోనా పరీక్షలు
- పాజిటివ్ గా నిర్ధారణ
తనకు కరోనా సోకడంపై స్పందిస్తూ, కొన్నిరోజులుగా తనను కలిసిన వాళ్లందరూ జాగ్రత్తగా ఉండాలని, వెంటనే కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. కాగా, నిరంజన్ రెడ్డి ఇవాళ కూడా తన నివాసం నుంచి ఓ అధికారిక కార్యక్రమంలో పాల్గొన్నారు. సహచర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో కలిసి నాబార్డు రాష్ట్ర దృష్టి పత్రాన్ని విడుదల చేశారు.