KTR: ఆదిలాబాద్ కు గుడ్ న్యూస్: కేటీఆర్

Happy news for Adilabad says KTR
షార్ట్స్‌లో చూడండి
ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు మంత్రి కేటీఆర్ శుభవార్త తెలిపారు. ఆదిలాబాద్ పట్టణంలో ఐటీ బిజినెస్ సర్వీసెస్ సెంటర్ ను ఏర్పాటు చేయబోతున్నట్టు ఆయన వెల్లడించారు. ట్విట్టర్ ద్వారా ఆయన ఈ విషయాన్ని తెలిపారు. 'ఆదిలాబాద్ కు శుభవార్త. ఆదిలాబాద్ పట్టణంలో కొత్త ఐటీ బిజినెస్ సర్వీసెస్ సెంటర్ ను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చిన ఎన్డీబీఎస్ ఇండియా ఎండీ, సీఈవో సంజీవ్ దేశ్ పాండేను కలిసి ధన్యవాదాలు తెలిపాను. టయర్ 2 పట్టణాలకు కూడా ఐటీ రంగాన్ని తీసుకెళ్లడానికి టీఆర్ఎస్ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఇందులో భాగంగా ఆ దిశగా మరో పెద్ద అడుగు పడింది' అని ట్వీట్ చేశారు.


Go Back to Shorts
KTR
TRS
Adilabad
IT

More Telugu News