Team India: దక్షిణాఫ్రికాతో మూడో వన్డే... టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్

  • కేప్ టౌన్ లో చివరి వన్డే
  • పరువు కోసం టీమిండియా ఆరాటం
  • టీమిండియాలో నాలుగు మార్పులు
  • సిరీస్ ను ఇప్పటికే 2-0తో గెలిచిన దక్షిణాఫ్రికా
Team India won the toss and elected bowling

టీమిండియా, దక్షిణాఫ్రికా జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ లో భాగంగా చివరి మ్యాచ్ నేడు కేప్ టౌన్ లో జరుగుతోంది. ఇప్పటికే 0-2తో సిరీస్ కోల్పోయిన టీమిండియా నామమాత్రంగా మారిన మూడో వన్డేలో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. కనీసం ఈ మ్యాచ్ లోనైనా గెలిచి పరువు దక్కించుకోవాలని భావిస్తోంది.

కాగా, ఈ మ్యాచ్ కోసం భారత్ తుది జట్టులో నాలుగు మార్పులు చేసింది. సూర్యకుమార్ యాదవ్, జయంత్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ, దీపక్ చహర్ లకు అవకాశమిచ్చింది. అటు, ఆతిథ్య దక్షిణాఫ్రికా జట్టులో స్పిన్నర్ తబ్రైజ్ షంసీ స్థానంలో డ్వేన్ ప్రిటోరియస్ తుదిజట్టులోకి వచ్చాడు.

More Telugu News