సంక్షిప్త వార్తలు ఇవిగో!

News roundup
  • ఏపీలో తీవ్రస్థాయిలో కరోనా వ్యాప్తి
  • తిరుపతి ఐఐటీలో 75 మందికి పాజిటివ్
  • మహారాష్ట్రలో ఒక్కరోజులో 46 వేలకు పైగా కొత్త కేసులు
  • మలుపు తిరిగిన ఒంగోలు హత్యాయత్నం వ్యవహారం
*  ఏపీలో కరోనా వైరస్ ఉద్ధృతంగా వ్యాపిస్తోంది. తాజాగా తిరుపతి ఐఐటీలోనూ కరోనా కలకలం చెలరేగింది. ఐఐటీ క్యాంపస్ లో 75 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దాంతో అధికారులు ఐఐటీ ప్రాంగణంలోని హాస్టల్ నే కొవిడ్ కేంద్రంగా మార్చారు.

*  మహారాష్ట్రలో గడచిన 24 గంటల్లో 46,353 కరోనా కేసులు వెల్లడయ్యాయి. అదే సమయంలో 48 మంది మృత్యువాత పడ్డారు.

*  ఓటర్లను ప్రలోభపెట్టే పార్టీల గుర్తింపు రద్దు చేయాలంటూ అశ్వినీ ఉపాధ్యాయ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేంద్ర ప్రభుత్వాన్ని, ఈసీని ప్రతివాదులుగా చేర్చాలని కోర్టును కోరారు. 'ఉచితం' హామీలు నిష్పక్షపాత, స్వేచ్ఛాయుత ఎన్నికలకు విఘాతమని పేర్కొన్నారు. ఉచితాలు ఓ రకంగా లంచం కిందకే వస్తాయని అశ్వినీ ఉపాధ్యాయ వివరించారు.

*  ఒంగోలులో యువకుడిపై దాడి కేసు ఆసక్తికర మలుపు తిరిగింది. ఇది వివాహేతర సంబంధాల నేపథ్యంలో జరిగిందని భావిస్తుండడం తెలిసిందే. షేక్ రబ్బానీ అనే వ్యక్తి కాశీరావు అనే యువకుడిపై కత్తితో దాడి చేశాడు. అయితే రబ్బానీ ఈ దాడికి ముందు నెల్లూరులో జంట హత్యలు చేశాడని పోలీసులు గుర్తించారు.

*  కలిగిరి మండలం అంబటివారి పాలెంలో ఉదయం జంట హత్యలు జరిగాయి. మీరమ్మ అనే మహిళను, ఆమె కుమారుడు అలీఫ్ ను రబ్బానీ అంతమొందించాడు. ఈ హత్యల తర్వాత ఒంగోలు వచ్చిన రబ్బానీ... రవిప్రియా మాల్ సమీపంలో కాశీరావుపై కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన కాశీరావు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. కలిగిరిలో హత్యకు గురైన మీరమ్మ... కాశీరావుకు వదిన అవుతుంది. వీరిద్దరిపై రబ్బానీ కొంతకాలంగా కక్ష పెంచుకున్నట్టు వెల్లడైంది.
Go Back to Shorts
News
Roundup
Corona Virus
Andhra Pradesh
Maharashtra
Tirupati IIT

More Telugu News