పంజాబ్ ముఖ్యమంత్రి బంధువుల ఇళ్లలో ఈడీ సోదాలు

ED raids ED raids CM Channi relative others in illegal sand mining case
  • ఇసుక కాంట్రాక్టుల్లో అక్రమాలపై ఆరా
  • సీఎం మేనల్లుడు భూపిందర్ కు ఇసుక కాంట్రాక్టులు
  • చిన్న కంపెనీ కాంట్రాక్టులు పొందడంపై సందేహాలు
  • రాష్ట్ర వ్యాప్తంగా 10 ప్రాంతాల్లో సోదాలు
పంజాబ్ ఎన్నికల ముందు ఆ రాష్ట్రంలో పరిణామాలు మారిపోతున్నాయి. ముఖ్యమంత్రి చరణ్ జిత్ సింగ్ చన్ని బంధువుల నివాసాలలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు మంగళవారం సోదాలు చేపట్టారు. మొహాలీలో ముఖ్యమంత్రి మేనల్లుడు భూపిందర్ సింగ్ హనీ నివాసంతోపాటు 10 ప్రాంతాల్లోని నివాసాలు, కార్యాలయాల్లో ఈ సోదాలు నడుస్తున్నాయి.

భూపిందర్ సింగ్ ఒక సంస్థను ఏర్పాటు చేసి దాని ద్వారా ఇసుక మైనింగ్ కాంట్రాక్టులను సంపాదించారు. మైనింగ్ కాంట్రాక్టులను సంపాదించేందుకు నల్లధనాన్ని ఇన్వెస్ట్ చేసినట్టు ఈడీ అనుమానిస్తోంది. ఎందుకంటే భూపిందర్ పెట్టిన కంపెనీ చాలా చిన్నది. అంత పెద్ద కాంట్రాక్టులు తీసుకునే స్థాయిలో లేకపోవడమే ఈ అనుమానాలకు నేపథ్యంగా ఉంది.

ఇసుక కాంట్రాక్టులు, ఇసుక మాఫియాపై ప్రతిపక్షాలు ఎప్పటి నుంచో విమర్శలు చేస్తున్నాయి. ముఖ్యమంత్రే ప్రోత్సహిస్తున్నారని ఆప్ సైతం ఆరోపణలు గుప్పిస్తోంది.
Go Back to Shorts
ED raids
punjab
cm channi
sand mining

More Telugu News