Mahesh Babu: త్రివిక్రమ్ - మహేశ్ సెట్స్ పైకి వెళ్లేది అప్పుడే!

  • ముగింపు దశలో 'సర్కారువారి పాట'
  • త్వరలో మళ్లీ సెట్స్ పైకి
  • ఏప్రిల్ నుంచి త్రివిక్రమ్ ప్రాజెక్టు మొదలు
  • సంగీత దర్శకుడిగా తమన్
Mahesh in Trivikram Movie

అంతా అనుకున్నట్టుగా జరిగితే ఈ సంక్రాంతికి మహేశ్ బాబు 'సర్కారువారి పాట' ప్రేక్షకుల ముందుకు వచ్చేది. కానీ కరోనా కారణంగా ఈ ప్రాజెక్టు ఆలస్యమవుతూ వచ్చింది. ఇక మహేశ్ మోకాలు సర్జరీ కూడా మరికొంత ఆలస్యానికి కారణమైంది. ఈ ప్రభావం మహేశ్ తో త్రివిక్రమ్ చేయనున్న సినిమాపై పడింది.

త్రివిక్రమ్ తో మహేశ్ చేయనున్న మూడవ సినిమా కావడంతో, సహజంగానే ఈ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. ఈ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందా అని అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ప్రాజెక్టు ఏప్రిల్లో పట్టాలెక్కనున్నట్టు చెబుతున్నారు. ఈ లోగా మహేశ్ 'సర్కారువారి పాట'ను పూర్తి చేయడం జరిగిపోతుందన్న మాట.

తమన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాలో కథానాయికగా పూజ హెగ్డే పేరు వినిపిస్తోంది. త్రివిక్రమ్ తో 'అరవింద సమేత' .. 'అల వైకుంఠపురములో' వంటి హిట్ సినిమాలు చేసిన పూజ, మహేశ్ తో కలిసి 'మహర్షి' వంటి హిట్ అందుకుంది. అందువలన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక మహేశ్ ఆ తరువాత సినిమాను రాజమౌళితో చేయనున్నట్టు తెలుస్తోంది.

More Telugu News