KTR: భార‌త ప్ర‌భుత్వంపై ఎలాన్ మ‌స్క్ వ్యాఖ్య‌లు.. కేటీఆర్ రిప్లై

  • భార‌త ప్రభుత్వంతో స‌వాళ్లు ఎదురవుతున్నాయన్న ఎలాన్ మ‌స్క్
  • అందుకే ఇండియాలోకి టెస్లా రాక ఆలస్యమవుతోందని వ్యాఖ్య‌
  • భార‌త్‌/తెలంగాణలో పరిశ్రమల అభివృద్ధికి అవ‌కాశాలున్నాయ‌న్న కేటీఆర్
  • తెలంగాణ‌ రాష్ట్రం పెట్టుబడులకు స్వర్గధామమ‌ని వ్యాఖ్య‌
ktr replies elan

టెస్లా సంస్థ అధినేత ఎలాన్‌ మస్క్ చేసిన ఓ ట్వీట్ కొన్ని రోజులుగా వైర‌ల్ అవుతోంది. భార‌త ప్రభుత్వంతో ఎదురవుతోన్న సవాళ్ల కారణంగానే ఇండియాలోకి టెస్లా రాక ఆలస్యమవుతోందని ఆయ‌న విమ‌ర్శించారు. దీనిపై ప‌లువురు ఇప్ప‌టికే మండిప‌డుతూ ట్వీట్లు చేశారు. తాజాగా, తెలంగాణ ఐటీ శాఖమంత్రి కేటీఆర్ కూడా ఈ ట్వీట్ పై స్పందించారు. ఎలాన్ మ‌స్క్ చేసిన ట్వీట్‌ను కేటీఆర్ రీట్వీట్ చేశారు.  

ముందుగా భారత్‌లో టెస్లా వ్యాపార కార్యకలాపాలను ప్రారంభిస్తున్నందుకు మస్క్‌కు ధన్యవాదాలని కేటీఆర్ పేర్కొన్నారు. భార‌త్‌/తెలంగాణలో పరిశ్రమల అభివృద్ధికి ఎన్నో అవకాశాలున్నాయని ఆయ‌న చెప్పారు. ప్ర‌ధానంగా పారిశ్రామిక అభివృద్ధి, పెట్టుబడులు, సుస్థిరత విషయాల్లో తెలంగాణ ఛాంపియన్‌గా నిలిచిందని కేటీఆర్ అన్నారు. తెలంగాణ‌ రాష్ట్రం పెట్టుబడులకు స్వర్గధామంగా ఉందని చెప్పారు.

More Telugu News