Vaishnav Tej: బుల్లితెరపై 'కొండపొలం' జోరు!

  • క్రిష్ దర్శకత్వంలో 'కొండ పొలం'
  • అడవి నేపథ్యంలో సాగే కథ 
  • థియేటర్ల నుంచి ఫ్లాప్ టాక్ 
  • బుల్లితెర నుంచి మంచి టీఆర్పీ  
Konda Polam movie update

క్రిష్ దర్శకత్వంలో ఆ మధ్య 'కొండ పొలం' అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వైష్ణవ్ తేజ్ .. రకుల్ నాయకా నాయికలుగా నటించిన ఈ సినిమాకి కీరవాణి సంగీతాన్ని సమకూర్చారు. ఆయన స్వరపరిచిన పాటలకి మంచి రెస్పాన్స్ వచ్చింది. అడవి నేపథ్యంతో రాసిన 'కొండ పొలం' అనే పుస్తకం ఆధారంగా ఈ సినిమా నిర్మితమైంది.

కరోనా తీవ్రంగా ఉన్న పరిస్థితుల్లో క్రిష్ దర్శకత్వం వహిస్తున్న 'హరిహర వీరమల్లు' సినిమా షూటింగు ఆగిపోయింది. తిరిగి ఆ సినిమా షూటింగు ఎప్పుడు మొదలవుతుందనేది తెలియని పరిస్థితి. అలాంటప్పుడు ఆ గ్యాప్ లో ఈ కథను తీసుకుని క్రిష్ ఫారెస్టుకు వెళ్లాడు. కోట .. సాయిచంద్ .. నాజర్ వంటి పరిమితమైన పాత్రలతో పట్టుగా ఈ కథను తెరకెక్కించాడు.

ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుందని అంతా అనుకున్నారు. కానీ ఎందుకనో ఈ సినిమా ఆశించిన స్థాయి ఫలితాన్ని అందుకోలేకపోయింది. ఈ సినిమా ఇటీవల 'స్టార్ మా'లో ఫస్టు టైమ్ ప్రసారం కాగా అర్బన్ లో 12.34 టీఆర్పీ వచ్చింది. థియేటర్లలో హిట్ కొట్టిన 'జాతిరత్నాలు'కి ఫస్టు టైమ్ టెలీకాస్ట్ లో ఇంతకంటే తక్కువ టీఆర్పీ రావడం గమనించవలసిన విషయం.

More Telugu News