ఏపీలో ఒక్కరోజులో 1200కి పైగా కరోనా కేసులు
- గత 24 గంటల్లో 38,479 కరోనా పరీక్షలు
- 1,257 మందికి పాజిటివ్
- చిత్తూరు జిల్లాలో 254 కొత్త కేసులు
- రాష్ట్రంలో ఇద్దరి మృతి
- ఇంకా 4,774 మందికి చికిత్స
అదే సమయంలో 140 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,81,859 పాజిటివ్ కేసులు నమోదవగా... 20,62,580 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 4,774 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 14,505కి పెరిగింది.