TSRTC: టైర్ పేలి మురుగు కాలువలోకి దూసుకెళ్లిన టీఎస్ఆర్టీసీ బస్సు.. డ్రైవర్ దుర్మరణం!

  • జగిత్యాల నుంచి నిర్మల్ వెళ్తున్న బస్సు
  • బస్సును నియంత్రించేందుకు ప్రయత్నించి కాలువలోకి పడిన డ్రైవర్
  • ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి
TSRTC bus driver dead as tire bursts

టైరు పేలడంతో ఆర్టీసీ బస్సు మురుగు కాలువలోకి దూసుకుపోయిన ఘటన తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో జరిగింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ దుర్మరణంపాలు కాగా... మిగిలిన 44 మంది ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు. వివరాల్లోకి వెళ్తే జగిత్యాల నుంచి నిర్మల్ వెళ్తున్న బస్సు మల్కాపూర్ చేరుకోగానే ముందు టైరు పేలిపోయింది.

ఈ క్రమంలో బస్సును నియంత్రించేందుకు విశ్వప్రయత్నం చేసిన డ్రైవర్ మురుగు కాలువలోకి పడిపోయాడు. ఈ ఘటనలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ప్రాణాలు విడిచారు. మరోవైపు తమ ప్రాణాలను కాపాడి ఆయన ప్రాణాలు విడిచారని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

More Telugu News