టైర్ పేలి మురుగు కాలువలోకి దూసుకెళ్లిన టీఎస్ఆర్టీసీ బస్సు.. డ్రైవర్ దుర్మరణం!

TSRTC bus driver dead as tire bursts
  • జగిత్యాల నుంచి నిర్మల్ వెళ్తున్న బస్సు
  • బస్సును నియంత్రించేందుకు ప్రయత్నించి కాలువలోకి పడిన డ్రైవర్
  • ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి
టైరు పేలడంతో ఆర్టీసీ బస్సు మురుగు కాలువలోకి దూసుకుపోయిన ఘటన తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో జరిగింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ దుర్మరణంపాలు కాగా... మిగిలిన 44 మంది ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు. వివరాల్లోకి వెళ్తే జగిత్యాల నుంచి నిర్మల్ వెళ్తున్న బస్సు మల్కాపూర్ చేరుకోగానే ముందు టైరు పేలిపోయింది.

ఈ క్రమంలో బస్సును నియంత్రించేందుకు విశ్వప్రయత్నం చేసిన డ్రైవర్ మురుగు కాలువలోకి పడిపోయాడు. ఈ ఘటనలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ప్రాణాలు విడిచారు. మరోవైపు తమ ప్రాణాలను కాపాడి ఆయన ప్రాణాలు విడిచారని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Go Back to Shorts
TSRTC
Bus Driver
Dead

More Telugu News