Chandrababu: చంద్రబాబుపై సీఐడీ కేసు.. స్టే పొడిగించిన హైకోర్టు

  • అమరావతి భూముల విషయంలో చంద్రబాబు, నారాయణలపై సీఐడీ కేసులు
  • గతంలోనే స్టే విధించిన ఏపీ హైకోర్టు
  • ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ ఆదేశాలు
AP High Court extends stay on CID case against Chandrababu in Amaravati assigned lands case

టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. అమరావతి అసైన్డ్ భూములకు సంబంధించి ఏపీ సీఐడీ చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణ తదితరులపై కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసుల్లో చంద్రబాబు, నారాయణలపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని సీఐడీని ఆదేశిస్తూ... గతంలోనే కేసులపై హైకోర్టు స్టే విధించింది. ఇప్పుడు ఆ స్టేను మరోసారి పొడిగించింది. మరో 6 వారాల పాటు స్టేను పొడిగిస్తున్నట్టు హైకోర్టు పేర్కొంది.

More Telugu News