Andhra Pradesh: ఏపీలో మరో 122 మందికి కొవిడ్ పాజిటివ్

  • గత 24 గంటల్లో 15,568 కరోనా పరీక్షలు
  • విశాఖ జిల్లాలో 41 కొత్త కేసులు
  • రాష్ట్రంలో ఒకరి మృతి
  • ఇంకా 1,278 మందికి చికిత్స
AP Covid daily update

ఏపీలో గడచిన 24 గంటల్లో 15,568 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించగా, 122 మందికి పాజిటివ్ గా తేలింది. అత్యధికంగా విశాఖ జిల్లాలో 41 మందికి కరోనా నిర్ధారణ అయింది. కృష్ణా జిల్లాలో 19, చిత్తూరు జిల్లాలో 13, గుంటూరు జిల్లాలో 10 కేసులు నమోదయ్యాయి. కడప, విజయనగరం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కొత్త కేసులేవీ నమోదు కాలేదు.

అదే సమయంలో 103 మంది కరోనా నుంచి కోలుకోగా, విశాఖలో ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,77,608 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 20,61,832 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. ఇంకా 1,278 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో మరణించిన వారి సంఖ్య 14,498కి పెరిగింది.

More Telugu News