Ajith Kumar: 'వలిమై' ట్రైలర్ స్పీడ్ మామూలుగా లేదే!

  • అజిత్ కుమార్ హీరోగా 'వలిమై'
  • పాన్ ఇండియా స్థాయి రిలీజ్ 
  • జనవరి 13న థియేటర్లకు 
  • సెన్సార్ కార్యక్రమాలు పూర్తి   
Valimai movie update

అజిత్ హీరోగా వినోద్ దర్శకత్వంలో 'వలిమై' సినిమా రూపొందింది. బోనీ కపూర్ నిర్మించిన ఈ సినిమా, యాక్షన్ .. ఎమోషన్ ప్రధానంగా నడుస్తుంది. ఈ సినిమాలో కథానాయికగా హుమా ఖురేషి కనిపించనుండగా, ప్రతినాయకుడి పాత్రను కార్తికేయ పోషించాడు. సంక్రాంతి కానుకగా జనవరి 13వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తున్నారు.

ఈ సినిమా నుంచి నిన్న సాయంత్రం ట్రైలర్ ను రిలీజ్ చేశారు. యాక్షన్ సీన్స్ ను ప్రధానంగా చేసుకుని వదిలిన ఈ ట్రైలర్ విశేషంగా ఆకట్టుకుంది. 'ధూమ్' సినిమా రేంజ్ లోని బైక్ ఛేజింగ్ సీన్స్ చూసి అంతా షాక్ అయ్యారు. ఇంతటి రిస్కీ యాక్షన్ సీన్స్ లో అజిత్ డూప్ లేకుండా చేశాడా? అని ఆశ్చర్యపోతున్నారు.

ఈ ట్రైలర్ ను వదిలిన 12 గంటల్లోనే 15 మిలియన్ కి పైగా వ్యూస్ ను రాబట్టడం విశేషం. అజిత్ కి గల క్రేజ్ కీ .. ఈ సినిమాపై ఉన్న అంచనాలకి ఇది ఒక నిదర్శనంగా చెప్పుకుంటున్నారు. తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకున్న ఈ సినిమా, U/ A సర్టిఫికెట్ ను సంపాదించుకుంది.

More Telugu News